సదాశివపేట,జనవరి2(మనప్రజాప్రతినిధి)
సదాశివపేట మండలంలోని కోనాపూర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ కొత్తగా నాయకత్వాన్ని కొనసాగించింది. గ్రామ కాంగ్రెస్లో ఉప్పరి విట్ఠల్ నూతన అధ్యక్షుడుగా, నాభిసబ్ ఉపాధ్యక్షుడుగా, వెంటురి శివ శంకర్ జనరల్ సెక్రటరీగా ఎన్నికయ్యారు.ఈ సందర్భంగా విట్ఠల్ మాట్లాడుతూ, “మాపై నమ్మకంతో ఈ పెద్ద బాధ్యత అప్పగించిన నా కాంగ్రెస్ గ్రామ కుటుంబీకులకు కృతజ్ఞతలు. ప్రతి ఒక్కరికి ఎల్లవేళలా అందుబాటులో ఉండి, ప్రజలకు కాంగ్రెస్ పార్టీకి సేవ చేయడానికి సిద్ధంగా ఉంటాను. కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ప్రతి పథకాన్ని ప్రజలకు చేరే విధంగా చొరవగా చర్యలు తీసుకుంటాను” అని అన్నారు.
కార్యక్రమంలో నూతన కమిటీ సభ్యులుగా అంజిరెడ్డి, బేగారి కుమార్, ఫజల్, ఆటుగారి శివ కుమార్, కుమ్మరి శ్రీకాంత్ భజించారు. గ్రామ కాంగ్రెస్ పెద్దలు మరియు సభ్యులు అధిక సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.