manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 11 January 2026, 1:10 pm Editor : Mana Praja Prathinidhi

హైదరాబాద్ నగరంలో జనసేన జెండా ఎగురవేస్తాం

జనసేన తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లచెరువు నరేందర్ గౌడ్
నర్సాపూర్ :(మనప్రజాప్రతినిధి)జనవరి11
హైదరాబాద్ నగరంలో రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో జనసేన పార్టీ సత్తా చాటుతుందని జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లచెరువు నరేందర్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో కనీసం 50 స్థానాల్లో జనసేన విజయం సాధిస్తుందని ఆయన అన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ సిద్ధాంతం అయిన “దోచుకో కాదు – దంచుకో కాదు – పంచుకో” అనే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడమే జనసేన లక్ష్యమన్నారు. ప్రజాశ్రేయస్సే ధ్యేయంగా, అవినీతి రాజకీయాలకు వ్యతిరేకంగా జనసేన పనిచేస్తుందని స్పష్టం చేశారు.పేద ప్రజలకు జనసేన పార్టీ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని, ప్రజా సమస్యల పరిష్కార మే తమ ప్రధాన కార్యాచరణ అని తెలిపారు.అలాగే త్వరలో పవన్ కళ్యాణ్ గారు కాళీమాత ఆలయాన్ని సందర్శించేందుకు వస్తున్నారని, ఈ కార్యక్రమానికి పార్టీలకు అతీతంగా ప్రజలందరూ హాజరుకావాలని ఆయన పిలుపునిచ్చారు.