మనప్రజాప్రతినిధి//పటాన్చెరు.ఫిబ్రవరి14
ఇస్నాపూర్ మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన చిట్కుల్ 4వ వార్డు అభ్యర్థి నీలం కవిత (నీలంమధుముదిరాజ్) 631 ఓట్ల భారీ మెజార్టీతో ఘన విజయం సాధించారు. ఈ విజయంతో చిట్కుల్ 4వ వార్డులో కాంగ్రెస్ పార్టీ శక్తిని మరింత బలపరిచినట్లు రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి.విజయం అనంతరం ఆమె మాట్లాడుతూ, తనపై విశ్వాసం ఉంచి గెలిపించిన ఇస్నాపూర్ ప్రజలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. వార్డు అభివృద్ధి, మౌలిక వసతుల మెరుగుదల, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.ఈ ఘన విజయంపై స్థానిక నాయకులు, కార్యకర్తలు ఆమెను అభినందిస్తూ విజయోత్సవాలు నిర్వహించారు.