వికలాంగుల పెన్షన్ రూ.6000కు పెంచాలి: వికలాంగుల హక్కుల జాతీయ వేదిక డిమాండ్
•ఎంపికైన లబ్ధిదారులకు సహాయ పరికరాల తక్షణ పంపిణీ చేయాలి మెదక్ జిల్లా,ఫిబ్రవరి25(మనప్రజాప్రతినిధి):వికలాంగుల పెన్షన్ను రూ.6000లకు పెంచాలని, ఎంపికైన లబ్ధిదారులకు సహాయ పరికరాలు వెంటనే పంపిణీ చేయాలని (వికలాంగులహక్కులజాతీయవేదిక(ఎన్పీఆర్డీ)) జిల్లా కార్యదర్శి యశోద డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 26 నెలలు పూర్తయ్యిందని, పెన్షన్ పెంపు కోసం సుమారు 42 లక్షల మంది లబ్ధిదారులు ఎదురుచూస్తున్నారని తెలిపారు.2026–27 ఆర్థిక సంవత్సర బడ్జెట్లో పెన్షన్ పెంపుకు తగిన నిధులు కేటాయించాలని కోరారు.2023 డిసెంబర్ నెల నుండి కొత్త పెన్షన్ల కోసం 24.85...