manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 09 February 2026, 1:54 am Posted by : Mana Praja Prathinidhi

జిల్లా అధ్యక్షుడు మహాదేవుని శ్రీనివాస్‌కు ఘన సన్మానం

•మల్లుపల్లిలో లింగాయత్ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు
మనప్రజాప్రతినిధి//సిద్దిపేట జిల్లా:మిరుదొడ్డిమండలం,ఫిబ్రవరి9
మిరుదొడ్డి మండల పరిధిలోని మల్లుపల్లి గ్రామంలో మండల లింగాయత్–లింగబలిజ కమిటీ ఆధ్వర్యంలో వీరశైవ లింగాయత్ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు మహాదేవుని శ్రీనివాస్‌కు ఘన సన్మానం నిర్వహించారు. మండల లింగబలిజ అధ్యక్షుడు పూడూరి శ్రీనివాస్ నాయకత్వంలో జరిగిన ఈ కార్యక్రమం ఉత్సాహంగా జరిగింది.
ఈ సందర్భంగా కొమురవెల్లి ఆలయంలో శ్రీ మల్లికార్జున స్వామిని జిల్లా అధ్యక్షుడు మహాదేవుని శ్రీనివాస్ దర్శించుకోగా, ఆలయ ప్రధాన పూజారి పెద్ద మల్లన్న ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం లింగాయత్ సభ్యులను శాలువాలు, పూలమాలలతో ఘనంగా సత్కరించారు.మల్లుపల్లి గ్రామంలో వీరభద్రస్వామి ఆలయ నిర్మాణం మరియు మండల కమిటీ హాల్ నిర్మాణానికి నిధులు కేటాయించాలని మండల అధ్యక్షుడు పూడూరి శ్రీనివాస్ విజ్ఞప్తి చేయగా, పూర్తి సహకారం అందిస్తామని జిల్లా అధ్యక్షుడు మహాదేవుని శ్రీనివాస్ హామీ ఇచ్చారు.మండల నూతన కమిటీ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు సభ్యులకు కృతజ్ఞతలు తెలిపిన పూడూరి శ్రీనివాస్, మండలంలోని లింగాయత్–లింగబలిజ సమాజ అభివృద్ధికి సమిష్టిగా కృషి చేస్తామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి పూడూరి రాజు, పూడూరి వీరభద్రస్వామి, పూడూరి కృష్ణ, పూడూరి మహేష్, పూడూరి సతీష్, పూడూరి దినేష్, పూడూరి విశ్వం, పూడూరి చంద్రబాబు తదితరులు పాల్గొన్నారు.