manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 02 February 2026, 7:12 am Editor : Mana Praja Prathinidhi

కీళ్ల వ్యాధులకు సమర్థవంతమైన చికిత్స – డాక్టర్ ఉపేందర్ సాతెల్ల

మనప్రజాప్రతినిధి//నారాయణఖేడ్ ఫిబ్రవరి 2:

నారాయణఖేడ్ పట్టణంలోని గాత్రి ఆసుపత్రిలో కీళ్ల వ్యాధుల చికిత్స నిపుణులు డాక్టర్ ఉపేందర్ సాతెల్ల (ఎంబీబీఎస్, ఓఎస్ఎం, ఎంఎస్ ఆర్థో) రోగులకు అత్యాధునిక వైద్య సేవలు అందిస్తున్నారు.
ఎముకలు, కీళ్లు, మోకాళ్ల నొప్పులు, వెన్నెముక సమస్యలు, బొక్కల సంబంధిత వ్యాధులు, ప్రమాదాల్లో గాయపడిన ఎముకల చికిత్సలో డాక్టర్ ఉపేందర్ సాతెల్లకు విశేష అనుభవం ఉంది. ముఖ్యంగా వృద్ధుల్లో కనిపించే మోకాళ్ల నొప్పులు, కీళ్ల దెబ్బతినడం, ఆస్టియో ఆర్థరైటిస్ వంటి సమస్యలకు శస్త్రచికిత్స లేకుండా సరైన చికిత్స అందించడం ఆయన ప్రత్యేకతగా నిలుస్తోంది. గాత్రి ఆసుపత్రిలో ఆధునిక వైద్య పరికరాలతో పాటు రోగులకు సరైన సలహాలు, నాణ్యమైన చికిత్స అందిస్తూ తక్కువ ఖర్చుతో మెరుగైన సేవలు అందిస్తున్నారని పలువురు రోగులు ప్రశంసిస్తున్నారు. ఎముకల నొప్పులతో బాధపడుతున్న వారు ముందుగానే వైద్యులను సంప్రదిస్తే సమస్య తీవ్రత తగ్గుతుందని డాక్టర్ ఉపేందర్ సాతెల్ల సూచిస్తున్నారు.కీళ్ల వ్యాధులు, బొక్కల సమస్యలతో బాధపడుతున్న రోగులు నారాయణఖేడ్ పట్టణంలోని గాత్రి ఆసుపత్రిలో డాక్టర్ ఉపేందర్ సాతెల్లను సంప్రదించి వైద్య సేవలు పొందవచ్చని ఆసుపత్రి యాజమాన్యం తెలిపింది.గాత్రి ఆయుపత్రిలో ఎముకల నిపుణులతో పాటు చెవి, ముక్కు, గొంతు, వైద్య నిపుణులు డాక్టర్ సురేష్ కుమార్ ఎంబీబీఎస్ (ఓఎస్ఎం), డిఎల్ఓ, డి.ఎన్.బి (ఈ.ఎన్. టి) యశోద డాక్టర్ ప్రతి మంగళవారం అందుబాటులో ఉంటారని నిర్వాహకులు సాయిలు అన్నారు. మరిన్ని వివరాలకు 9502830068 సంప్రదించాలనన్నారు. నారాయణఖేడ్ పట్టణంలో గాత్రి ఆసుపత్రిలో అందుతున్న సేవలను నియోజకవర్గ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.