రామాయంపేట్,ఫిబ్రవరి10(మనప్రజాప్రతినిధి):
మెదక్ జిల్లా రామాయంపేట్ మండలంలోని ఝాన్సీ లింగాపూర్ గ్రామంలో ఆర్బీఐ వైడ్స్ –సిఎఫ్ఎల్ కన్సిలర్స్ (హవేలీ ఘన్పూర్) ఆధ్వర్యంలో ఫైనాన్షియల్ అవేర్నెస్ క్యాంప్ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆర్బీఐ వీడ్స్ సిఎఫ్ఎల్ కౌన్సిలర్ టి. వంశీ మాట్లాడుతూ బ్యాంకింగ్ సేవలకు సంబంధించిన కేవైసీ.రికేవైసి, చికెవైసీ మ్యూల్ అకౌంట్స్ ప్రమాదాలు, డిజిటల్ బ్యాంకింగ్ వినియోగం,అలాగే అన్క్లెయిమ్డ్ అకౌంట్స్ గురించి గ్రామ ప్రజలకు వివరించారు.ఈకార్యక్రమంలోగ్రామసర్పంచ్ మునిగాలరామకిష్టయ్య, తెలంగాణ గ్రామీణ వికాస్ బ్యాంక్ రామాయంపేట్ ఫీల్డ్ ఆఫీసర్ భాను, ఉప సర్పంచ్, బ్యాంక్ మిత్ర సౌందర్యతో పాటు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.