manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 08 February 2026, 4:20 pm Editor : Mana Praja Prathinidhi

10వ వార్డులో ఇండిపెండెంట్ అభ్యర్థి ర్యాకల వీరేశం ప్రచారం జోరు

•మంగళహారతులతో స్వాగతం పలుకుతున్న వార్డు ప్రజలు-ఎయిర్ కండిషనర్ గుర్తుకే ఓటు వేయాలని విజ్ఞప్తి
సదాశివపేట,ఫిబ్రవరి8(మనప్రజాప్రతినిధి)
సదాశివపేట పట్టణంలోని 10వ వార్డులో ఇండిపెండెంట్ అభ్యర్థి ర్యాకల వీరేశం ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్న ఆయనకు వార్డు ప్రజలు మంగళహారతులతో స్వాగతం పలుకుతూ ఆశీర్వాదాలు అందిస్తున్నారు.“యువతకు ఆదర్శంగా నిలిచే మచ్చలేని వ్యక్తి రాజకీయాల్లో ఉండాలి” అని స్థానికులు అభిప్రాయపడుతూ, వీరేశం విజయానికి తమ మద్దతు ప్రకటిస్తున్నారు. ఈ సందర్భంగా ర్యాకల వీరేశం మాట్లాడుతూ, ప్రజా సమస్యల పరిష్కారమే తన ప్రధాన లక్ష్యమని పేర్కొంటూ, ఎయిర్ కండిషనర్ గుర్తుకే ఓటు వేసి ఆశీర్వదించాలని ఓటర్లను కోరారు.