మనప్రజాప్రతినిధి//నారాయణఖేడ్ ఫిబ్రవరి 9: మున్సిపల్ ఎన్నికల ప్రచారం నేడు సాయంత్రం 5 గంటలకు ముగియనుంది.11న జరుగనున్న పోలింగ్ నేపథ్యంలో 48 గంటల ముందే ప్రచారం నిలిచిపోతుంది.5 గంటల తర్వాత ర్యాలీలు, ప్రచార వాహనాలు,మైకులపై నిషేధం విధించబడుతుంది.ఎన్నికల కోడ్ అమలులో భాగంగా ఎన్నికలు ముగిసేవరకు మద్యం దుఖానాలు కూడ మూసి ఉంచుతారు.ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.