-బిజెపి రాష్ట్ర నాయకురాలు *కట్ల స్వప్న సైదులు గౌడ్
మనప్రజాప్రతినిధి//సూర్యపేట జిల్లా:
మండలంలోని పస్తాల గ్రామంలో జరిగిన మినీ మేడారం జాతరను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని బిజెపి రాష్ట్ర నాయకురాలు *కట్ల స్వప్న సైదులు గౌడ్* అన్నారు. జాతర ముగింపు సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో పస్తాల గ్రామానికి ఓ చరిత్ర ఉందని ఖచ్చితంగా ప్రభుత్వం గుర్తించి పర్యాటక కేంద్రంగా గుర్తించాలన్నారు.ఆలయ అభివృద్ధి కోసం తమ వంతు కృషి చేస్తామని తెలిపారు.అనంతరం కుటుంబ సభ్యులతో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో వడ్లకొండ రాములు గౌడ్, కట్ల రాము, కట్ల యాకస్వామి,గౌతమ్ గౌడ్, దేవాన్ష్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.