manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 02 March 2026, 9:28 am Editor : MANA PRAJA PRATINIDHI

మృతి చెందిన కుటుంబానికి ఆర్థిక సాయం

మనప్రజాప్రతినిధి//మేళ్లచెరువు –

మేళ్లచెరువు మండల కేంద్రంలోనీ వేపాలమాధవరం గ్రామనికి చెందిన షేక్ చాందిని ఆదివారం రోజు మృతి చెందారని విషయం తెలుసుకున్న మాజీ సర్పంచ్ భోగాల మోహన్ రెడ్డి భౌతిక కాయాన్ని సందర్శించి, పూలమాల వేసి నివాళులు అర్పించారు వారి కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి తన వంతు సహాయంగా పది వేల రూపాయలు ఆర్థిక సహాయం చేశాడు ఆపదలో ఉన్న వారికి అండగా ఉంటూ అనునిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటానని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కుక్కల కనకయ్య మాజీ సర్పంచ్ భొగల మోహన్ రెడ్డి మాజీ మార్కెట్ వైస్ చైర్మన్ జక్కుల శంభయ్య కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు