manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 01 March 2026, 10:33 am Editor : Mana Praja Prathinidhi

విలువైన ఆస్తి పత్రాలు పోయినవి

ప్రయాణ సమయంలో రిజిస్టర్డ్ సేల్ డీడ్ పత్రం తప్పిపోయినట్లు అఫిడవిట్ ద్వారా వెల్లడించిన ఎం.నాగమణి
సిద్దిపేట.మార్చి1(మనప్రజాప్రతినిధి)
నాందేడ్ (మహారాష్ట్ర)కు చెందిన ఎం. నాగమణి తన ఆస్తికి సంబంధించిన అసలు రిజిస్టర్డ్ సేల్ డీడ్ పత్రం పోగొట్టుకున్నట్లు అఫిడవిట్ ద్వారా వెల్లడించారు.వివరాల్లోకి వెళితే, కీసర మండలం నాగారం గ్రామ పరిధిలోని వీవర్స్ కాలనీ, భవానానగర్, దమ్మాయి గూడ గ్రామంలో ఉన్న ప్లాట్ నం. 1246/A, సర్వే నంబర్లు 388, 407, 408కు సంబంధించిన 160 చదరపు గజాల స్థలాన్ని డాక్యుమెంట్ నం.2511/2009 ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు తెలిపారు.ఆ ఆస్తికి సంబంధించిన అసలు పత్రం గత నెల 15వ తేదీన వెంకటేశ్వర స్వామి దేవాలయం నుండి సిద్దిపేట పాత బస్ స్టాండ్‌కు ప్రయాణిస్తున్న సమయంలో తప్పిపోయిందని పేర్కొన్నారు.
అదేవిధంగా, ఆ అసలు పత్రాన్ని ఎటువంటి బ్యాంకు లేదా ఆర్థిక సంస్థల వద్ద గానీ, ఎవరైనా వ్యక్తుల వద్ద గానీ గిరవం పెట్టలేదని స్పష్టం చేశారు.
ఎవరైనా ఆ పత్రాన్ని కనుగొన్న యెడల సంబంధిత వ్యక్తికి అందజేయాలని కోరారు.