•చైత్ర మాస శివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజలు.
•విజయదుర్గామాతకు పంచామృతాభిషేకం – స్వామివారికి అన్నపూజ..•ఉదయం 6:30 గంటలకు గణపతి పూజతో కార్యక్రమం ప్రారంభం
మనప్రజాప్రతినిధి//కొండపాక మండలం.ఏప్రిల్16
చైత్ర మాస శివరాత్రి సందర్భంగా మర్పడగ గ్రామంలోని శ్రీ విజయదుర్గా సమేత సంతాన మల్లికార్జున స్వామి దేవస్థానంలో అన్నాభిషేకం వైభవంగా నిర్వహించారు. చెప్పెల హరినాథ శర్మ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం ఉదయం గణపతి పూజతో ప్రారంభమైంది.
విజయదుర్గామాతకు పంచామృత, ఫలరస అభిషేకాలు నిర్వహించి పట్టు వస్త్రాలతో అలంకరించగా, సుబ్రహ్మణ్య స్వామికి ప్రత్యేక అభిషేకం నిర్వహించారు. అనంతరం లఘున్యాసంతో సంతాన మల్లికార్జున స్వామికి అన్నపూజ చేశారు.
ఈ కార్యక్రమంలో క్షేత్ర కమిటీ సభ్యులు చీకోటి రాజేంద్ర ప్రసాద్, మర్యాల రవీంద్ర, విఠల్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేశారు.