manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 26 April 2026, 11:28 am Posted by : MANA PRAJA PRATINIDHI

మేళ్లచెరువు శివాలయంలో ఓజో ఫౌండేషన్ చైర్మన్ పిల్లుట్ల రఘు పూజలు

మనప్రజాప్రతినిధి//మేళ్లచెరువు

సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండల కేంద్రంలోని స్వయంభు శంభు లింగేశ్వర స్వామిను ఓజో ఫౌండేషన్ చైర్మన్ పిల్లుట్ల రఘు సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శివుని అనుగ్రహంతో నేడు హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో సూర్యాపేట ఎంఎస్ఏ,మాజీ మంత్రి గుంతకండ్ల జగదీశ్ రెడ్డి ఆధ్వర్యంలో కేటీఆర్ సమక్షంలో తాను బిఆర్ఎస్ పార్టీలో చేరనున్నట్లు తెలిపారు. గత కొన్ని సంవత్సరాలుగా ఆయన ఓజో ఫౌండేషన్ పేరిట హుజూర్ నగర్ నియోజకవర్గంలో పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించి ప్రజలు, యువకుల్లో మంచి పేరు పొందారు.