manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 27 May 2026, 9:05 am Editor : Mana Praja Prathinidhi

పేదలకు అండగా సీఎంఆర్ఎఫ్

రాంపల్లిలో లబ్ధిదారునికి రూ.24 వేల చెక్కుల పంపిణి
మనప్రజాప్రతినిధి//కొండపాకమండల.మే27
మండలంలోని రాంపల్లి గ్రామానికి చెందిన చిట్యాల నరేష్‌కు మంజూరైన రూ.24 వేల సీఎంఆర్ఎఫ్ చెక్కును మంగళవారం గ్రామ సర్పంచ్ బొమ్మ మల్లయ్య ఆధ్వర్యంలో లబ్ధిదారునికి అందజేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ సీఎం సహాయ నిధి నిరుపేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పిస్తూ వరంలా నిలుస్తోందన్నారు.
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మాధవి సుధాకర్, వార్డు సభ్యులు కొంతం శ్రీనివాస్, సీత యాదగిరి, మాజీ సర్పంచ్ సురేందర్ రెడ్డి, ఉండే మహిపాల్ రెడ్డి, బొమ్మ నర్సిములు, నాంగి స్వామి, రవి, చుక్క బీరయ్య, రాజు, చిట్యాల బాపూరాజు, వీరం రెడ్డి, బాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.