విద్యార్థులకు మత్తు పదార్థాలు అమ్మవద్దు అని దుకాణదారులకు హెచ్చరికలు జారీచేసిన నేరేడుచర్ల పోలీసులు.

మనప్రజాప్రతినిధి//నేరేడుచర్ల, జూన్10:త్వరలో పాఠశాలలు ప్రారంభం అవుతున్న సందర్భంగా పాఠశాలలు ఉన్న ప్రాంతాల్లో పొగాకు సంబంధ ఉత్పత్తులు, మత్తు పదార్థాలు అమ్మకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ నరసింహ ఆదేశాల మేరకు నేరేడుచర్ల మండల కేంద్రంలో మరియు ఇతర గ్రామాలలో పాఠశాల ప్రాంతాలలో ఉన్న దుకాణాలలో నేరేడుచర్ల పోలీసులు తనిఖీలు నిర్వహించడం జరిగింది. ఈ తనికిలలో భాగంగా షాప్ నిర్వాహకులకు అవగాహన కల్పించారు స్కూల్ ప్రాంతాలలో పొగాకు ఉత్పత్తులు అమ్మవద్దని విద్యార్థులకు ఎలాంటి మత్తు పదార్థాలు అమ్మకూడదని వారికి సూచించడం జరిగిందని ఎస్ఐ తెలిపారు.