manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 23 June 2026, 12:54 pm Posted by : MANA PRAJA PRATINIDHI

బ్రహ్మకుమారి నూతన సెంటర్ కోసం రూ.1 లక్ష విరాళం

మనప్రజాప్రతినిధి//కోహిర్ జూన్ 23

కోహిర్ మండలంలో నూతనంగా నిర్మించబడుతున్న బ్రహ్మకుమారి భవనం నిర్మాణానికి పోతిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన ప్రముఖ సామాజిక సేవకుడు రాగులపల్లి నర్సిములు యాదవ్ తన వంతు సహాయంగా రూ.1,00,000 (ఒక లక్ష రూపాయలు) విరాళంగా అందజేశారు.ఈ సందర్భంగా బ్రహ్మకుమారి సెంటర్ సభ్యులు, భక్తులు మరియు కమిటీ సభ్యులు నర్సిములు యాదవ్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ సంతోషం వ్యక్తం చేశారు. సమాజ సేవా కార్యక్రమాలకు ఆయన అందిస్తున్న సహకారం ఆదర్శప్రాయమని కొనియాడారు.