బాల్యం నాటి మధురస్మృతులే వెన్నంటి ఉంటవి వీరభాస్కర్
మనప్రజాప్రతినిధి//గరిడేపల్లి బాల్యం నాటి మధురస్మృతులు జీవితాంతం మన అంతిమ గడియల వరకు మన వెన్నంటే ఉంటవని చినర్జీ ఆగ్రో కెమికల్స్ మేనేజింగ్ డైరెక్టర్, ఇంటర్నేషనల్ బిజినెస్ అవార్డు గ్రహీత సుందరి వీరభాస్కర్ అన్నారు. మండలంలోని పొనుగోడు ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసించిన 1990 బ్యాచ్ వారు సోమవారం పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా వీరభాస్కర్ మాట్లాడుతూ జీవితంలో ఎన్నో సంఘటనలు జరుగుతుంటవని వాటిలో జీవితాంతం గుర్తిండి పోయేవి మాత్రం చిన్ననాటి సంఘటనలేనని, మన కలయిక జీవితాంతం కొనసాగాలన్నారు.వరంగల్ లో ఎలక్ట్రికల్ ...