మనప్రజాప్రతినిధి//తొగుట జూన్ 28
వెంకట్రావుపేట గ్రామంలో నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమాన్ని సర్పంచ్ బండారు కవిత స్వామి గౌడ్ ప్రారంభించారు
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, 5 సంవత్సరాల లోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించి, ఆరోగ్యకరమైన భవిష్యత్తుకు తోడ్పడాలని గ్రామ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
“చక్కటి జీవితానికి రెండు చుక్కలు పోలియో రహిత భారతం మనందరి లక్ష్యం.”
తల్లిదండ్రులు తమ చిన్నారులను సమీప పోలియో కేంద్రానికి తీసుకువెళ్లి తప్పకుండా పోలియో చుక్కలు వేయించాలని కోరారు. కార్యక్రమం లో ఉప సర్పంచ్ లచోళ్ల లింగం, వార్డు సభ్యులు మిద్దె శ్రీనివాస్, అంగన్వాడీ కార్యకర్తలు, ఏ ఎన్ ఎం లక్ష్మి, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు