manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 27 December 2025, 2:44 pm Posted by : Mana Praja Prathinidhi

బీసీ  బిడ్డగా అభివృద్దే నా ధ్యేయం

మనప్రజాప్రతినిధి//నర్సాపూర్,27:

సర్పంచుల ఫోరం అధ్యక్షుడు రంగి కృష్ణ మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం లో బి ఆర్ ఎస్ బలపరిచిన సర్పంచుల ఫోరం అధ్యక్షుడు యువ నాయకుడు, రెండు పర్యాయాలు గెలిచిన రంగి కృష్ణ ప్రజలను వేడుకున్నాడు, జనాభా దామాషా ప్రకారం గంపటి శాతం ఉన్న బీసీలు, నాకూ అవకాశం ఇవ్వాలని ఈరోజు వెల్దుర్తి మండలం లో ఒక బీసీ నాయకుడు సర్పంచ్ ఫోరం అధ్యక్షుడిగా అడ్డుకటగా ఎంఐఎం, కాంగ్రెస్, బిజెపి విరుద్ధ పార్టీలు కలిసి కుట్రలు చేస్తున్నారని, ప్రజలు అంతా గమనిస్తున్నారని రంగి కృష్ణ తెలియజేశారు, సర్పంచుల ఫోరం అధ్యక్షుడిగా నాకు అవకాశం కల్పిస్తే వెల్దుర్తి మండలాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని, సర్పంచ్ గా కాకుండా సేవకునిగా పనిచేస్తానని, పేద ప్రజల నిస్వార్థ సేవకునిగా, మౌలిక వసతుల పట్ల పేద ప్రజల, రేషన్ కార్డ్, డబుల్ బెడ్ రూమ్ ఇల్లు, పెన్షన్లు, గ్రామంలో విద్యుత్ దీపాలు, పచ్చదనం పరిశుభ్రం, డ్రైనేజీ సమస్యలు, మంచినీటి వసతి, యువకులకు ఉద్యోగ అవకాశాలు, విద్యార్థినీ విద్యార్థులకు మంచి భోజనం అందిస్తానని రంగి కృష్ణ తెలియజేశారు.