manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 16 August 2026, 2:20 pm Posted by : MANA PRAJA PRATINIDHI

ఉచిత కుట్టుమిషన్ శిక్షణ పూర్తి చేసిన విద్యార్థినులకు కల్వకుంట్ల వంశీధర్ రావు చేతుల మీదుగా సర్టిఫికెట్లు అందజేశారు.

మనప్రజాప్రతినిధి//సిద్దిపేట, ఆగస్టు016

సిద్దిపేట పట్టణ కేంద్రంలోని రైతు బజార్ వద్ద గత మూడు సంవత్సరాలుగా కల్వకుంట్ల వంశీధర్ రావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత కుట్టుమిషన్ శిక్షణ కేంద్రం నిర్వహిస్తున్నారు. ఈ శిక్షణ ద్వారా మహిళలకు కుట్టుపని నైపుణ్యాలను అందిస్తూ స్వయం ఉపాధి దిశగా ప్రోత్సహిస్తున్నారు.ఈ క్రమంలో కుట్టుమిషన్ శిక్షణను విజయవంతంగా పూర్తి చేసిన విద్యార్థినులకు కల్వకుంట్ల వంశీధర్ రావు చేతుల మీదుగా సర్టిఫికెట్లు అందజేశారు. శిక్షణ పూర్తిచేసుకున్న విద్యార్థినులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని స్వయం ఉపాధి పొందాలని నిర్వాహకులు ఆకాంక్షించారు.
కార్యక్రమంలో శిక్షణ కేంద్రం ట్రైనర్ షాహిన్ బేగంతో పాటు ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు.