manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 02 December 2025, 4:04 pm Posted by : Mana Praja Prathinidhi

ఆర్‌.ఓ. కేంద్రాలను తనిఖీ చేసిన ఎన్నికల సాధారణ పరిశీలకులు

మనప్రజాప్రతినిధి//రాజన్నసిరిసిల్ల,డిసెంబర్ 02
గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంతో జిల్లా సాధారణ పరిశీలకుడు రవి కుమార్ మంగళవారం పలు ఆర్‌.ఓ. కేంద్రాలను తనిఖీ చేశారు.
ఇల్లంతకుంట మండలంలోని పొత్తూరు, పెద్దలింగాపూర్ గ్రామాల్లో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాలను పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు.ఆర్‌.ఓ. కార్యాలయాల్లో నామినేషన్ల స్వీకరణ, హెల్ప్ డెస్క్, అవసరమైన ఏర్పాట్లు, శాంతి భద్రతా చర్యలను సమీక్షించి అవసరమైన సూచనలు అందించారు.ఈ కార్యక్రమంలో ఇల్లంతకుంట ఎంపీడీఓ శశికళ, సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు.