manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 04 December 2025, 9:32 am Posted by : Mana Praja Prathinidhi

3వవార్డుమెంబర్‌గాపర్సలక్ష్మినామినేషన్ దాఖలు

మెదక్ జిల్లా//మన ప్రజాప్రతినిధి//డిసెంబర్ 4
3వ వార్డు మెంబర్‌గా తన నామినేషన్‌ను పర్స లక్ష్మి గురువారం దాఖలు చేశారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ“ప్రజలు నాకు అవకాశం ఇస్తే, వార్డు అభివృద్ధి కోసం పూర్తిస్థాయిలో కృషి చేస్తాను” అని తెలిపారు.గత కొన్ని సంవత్సరాలలో తాను వార్డు ప్రజలకు చిన్నా–పెద్దా తేడా లేకుండా సేవలు, సహాయ సహకారాలు అందించానని లక్ష్మి పేర్కొన్నారు. ప్రజలు ఒక్కసారి వార్డు మెంబర్‌గా గెలిపిస్తే, వచ్చే ఐదు సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం అందించే ప్రతి పథకాన్ని ప్రజల్లోకి చైతన్యపరచేందుకు కట్టుబడి ఉంటానని చెప్పారు.
అభివృద్ధినే లక్ష్యంగా పెట్టుకుని పని చేస్తానని, ప్రతి ఓటరును ఆమె తమ అమూల్యమైన ఓటుతో సహకరించి, భారీ మెజార్టీతో గెలిపించమని కోరారు.