manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 25 February 2026, 11:40 am Posted by : Mana Praja Prathinidhi

రహీంఖాన్‌పేట కాలువపై మోటర్లు తొలగించాలి: గ్రామస్తుల డిమాండ్

•అనంతారం గ్రామపంచాయతీ సర్పంచ్‌ను కలిసి వినతి
మనకొండూరు,ఫిబ్రవరి25(మనప్రజాప్రతినిధి):
ఇల్లంతకుంట మండలంలోని రహీంఖాన్‌పేట గ్రామస్తులు, గ్రామ సర్పంచ్ కముటం లావణ్య రాములు, ఉప సర్పంచ్ గడ్డమీది పద్మ ఆధ్వర్యంలో రహీంఖాన్‌పేట కాలువ నుండి వచ్చే నీటిని కొంతమంది నిరుపయోగంగా వినియోగిస్తున్నారంటూ ఫిర్యాదు చేశారు.
ఈ నేపథ్యంలో అనంతారం గ్రామపంచాయతీ సర్పంచ్ వొల్లాల రజిత వెంకటేష్‌ను కలిసి సమస్యను వివరించారు.సర్పంచ్ కముటం లావణ్య రాములు మాట్లాడుతూ, తమ గ్రామ చెరువులో ఏర్పాటు చేసిన మోటార్లను గ్రామస్తుల సహకారంతో ఇప్పటికే తొలగించామని తెలిపారు. అలాగే కాలువ వెంట ఉన్న మోటార్లను కూడా తీసివేశా మని చెప్పారు.కావున కాలువపై ఇంకా ఉన్న మోటార్లను అనంతారం గ్రామస్తులు స్వచ్ఛందంగా తొలగించాలని కోరారు. లేనిపక్షంలో తమ గ్రామస్తుల సహకారంతో తామే మోటార్లను తొలగించే చర్యలు చేపడతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు కుశాల అంజయ్య, కూస రవి, గ్రామస్తులు ఏనుగుల మహేందర్, ఉత్కం రాజయ్య, ఓరుగంటి రాజేశం, బొల్లం రాజు, బత్తిని ఆంజనేయులు, ఉత్కం రాజు, పొన్గంటి వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.