మనప్రజాప్రతినిధి//కొండపాకమండలం.12డిసెంబర్
కొండపాక మండలకేంద్రంలోని ఏఏంసీ గోదాంలో ఏర్పాటు చేసిన ఈవిఎం గోదాం ను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కె. హైమావతి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రెవెన్యూ శాఖ అధికారులు, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ ప్రతినిధుల సమక్షంలో గోదాంను అధికారి కంగా తెరిచి తనిఖీ చేపట్టారు.కలెక్టర్ హైమావతి మాట్లాడు తూ,గోదాంలో ఉన్న కాలం చెల్లిన 5 బ్యాలెట్ యూనిట్లు, 6 కంట్రోల్ యూనిట్లను త్వరలోనే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు అప్పగించనున్నట్లు తెలిపారు. అనంతరం గోదాం పై డోర్ సీల్ వేసి, విజిట్ రిజిస్టర్లో సంతకం చేశారు. మొత్తం ప్రక్రియను వీడియోగ్రఫీ చేస్తున్నట్లు కూడా పేర్కొన్నారు.ఈ సందర్శనలో కలెక్టర్తో పాటు
ఏఓ రాజ్కుమార్,తహసిల్దార్ మల్లికార్జున్,పోలీస్ అధికారులు,
రాజకీయ పార్టీ ప్రతినిధులు పాల్గొన్నారు.

