Sunday, March 8, 2026
ads
Homeతెలంగాణజిల్లా వార్తలుఖాజీపూర్ గ్రామ అభివృద్ధికి పుట్‌బాల్ గుర్తుకు ఓటేయండి: లింగలగల్ల మంజుల పర్శరాములు

ఖాజీపూర్ గ్రామ అభివృద్ధికి పుట్‌బాల్ గుర్తుకు ఓటేయండి: లింగలగల్ల మంజుల పర్శరాములు

📰 Generate e-Paper Clip

మనప్రజాప్రతినిధి//అక్బర్పేట భూంపల్లి మండలం
దుబ్బాక నియోజకవర్గం, సిద్దిపేట జిల్లా
అక్బర్పేట–భూంపల్లి మండల పరిధిలోని ఖాజీపూర్ గ్రామంలో బుధవారం సర్పంచ్ అభ్యర్థి లింగలగల్ల మంజుల పర్శరాములు ఇంటింటా ప్రచారం నిర్వహించారు. గ్రామంలోని సమాజాలు, మహిళా సంఘాలు, యువత, వృద్ధులను కలుసుకుంటూ అభివృద్ధిపై తన ప్రణాళికలను వివరించారు.ఈ సందర్భంలో మాట్లాడిన ఆమె… “పార్టీలకతీతంగా గ్రామం కోసం పనిచేసే సేవకురాలిని. నాకు ఒక అవకాశమిస్తే ఖాజీపూర్‌ను ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతాను. మీ ప్రతి సమస్యకు అందుబాటులో ఉంటాను. గ్రామ శ్రేయస్సే నా లక్ష్యం” అని తెలిపారు.తాను నిలబెట్టుకున్న పుట్‌బాల్ గుర్తుకు ఓటు వేసి ఆశీర్వదించాలని గ్రామ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.“గత ఎన్నికల్లో ఓడిపోయినా మీరు చూపిన ప్రేమ, విశ్వాసం నాకు బలం. ఈసారి మీ ఓటుతో గెలిపిస్తే అభివృద్ధి ఆగిపోయిన పనులు అన్నీ పూర్తి చేస్తాను. ప్రభుత్వ పథకాల్ని అర్హులందరికీ చేరుస్తాను. యువతకు ఉపాధి, మహిళా సంఘాలకు శక్తి, గ్రామంలో శుభ్రత–వెలుగులు–వసతులు తీసుకొస్తాను” అని అన్నారు.ఖాజీపూర్ గ్రామంలో అనేక పనులు నిలిచిపోయాయని, ఇంకా పరిష్కారం కావాల్సిన అంశాలు ఎన్నో ఉన్నాయని గుర్తుచేస్తూ…“అధికారులతో చర్చించి, ప్రజల సహకారంతో ప్రతి పనిని పూర్తి చేసే దిశగా ముందుకు సాగుతాను. ఏ పని చేస్తున్నా ముందు ప్రజలకు తెలియజేస్తాను. అబద్ధాలు కాదు—అభివృద్ధి చేసి చూపిస్తాను” అన్నారు.చివరిగా గ్రామ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ…“ఒక్కసారి ఆలోచించండి… మీ అమూల్యమైన ఓటు పుట్‌బాల్ గుర్తుపై వేసి నన్ను సర్పంచ్‌గా గెలిపించండి” అని లింగలగల్ల మంజుల పర్శరాములు కోరుకున్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular