ఎర్పేడు,జనవరి1(మనప్రజాప్రతినిధి):
నూతన సంవత్సరం సందర్భంగా ఏర్పేడు మండల కేంద్రంలోని తెలుగు దేశం పార్టీ కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల టీడీపీ పార్టీ అధ్యక్షులు పేరం నాగరాజు నాయుడు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని నూతన సంవత్సరానికి శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ బలోపేతానికి సమిష్టిగా కృషి చేయాలని ఈ సందర్భంగా నాయకులు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మహేష్ రెడ్డి, కృష్ణవేణి, కేశినేని సుబ్రహ్మణ్యం, గుణాయాదవ్, రాచటి సుబ్రహ్మణ్యం, మునిరెడ్డి, కెకె రమణ, బి మునిరాజ యాదవ్, నాగేశ్వర్ నాయుడు, మధు రెడ్డి, తులసి, మురళి, సుబ్రహ్మణ్యం, వెంకటరమణ, మునీంద్ర, వై. మనోహర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.
పేరం నాగరాజు నాయుడు ఆధ్వర్యంలో టిడిపి కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా
RELATED ARTICLES

