Wednesday, February 18, 2026
ads
Homeఆంధ్రప్రదేశ్గుడిమల్లం పరశురామేశ్వర స్వామి దేవాలయంలో జాజ్వల్యంగా గిరి ప్రదక్షిణ -భక్తుల వెల్లువ

గుడిమల్లం పరశురామేశ్వర స్వామి దేవాలయంలో జాజ్వల్యంగా గిరి ప్రదక్షిణ -భక్తుల వెల్లువ

📰 Generate e-Paper Clip

•వేలాదిగాతరలివచ్చినభక్తులు…గోవిందవరంగ్రామంలోఘనంగాఅన్నదానం… నాయకులు,ప్రజలు భారీపాల్గొనడం

గిరిప్రదక్షిణలో ఆధ్యాత్మిక ఉత్సాహం

మనప్రజాప్రతినిధి//ఎర్పేడుమండలం,ఫిబ్రవరి18:
ప్రముఖ పుణ్యక్షేత్రమైన గుడిమల్లం పరశురామేశ్వర స్వామి గిరి ప్రదక్షిణ కార్యక్రమం అత్యంత వైభవంగా, భక్తి పారవశ్యంతో జరిగింది. తెల్లవారుజామున నుంచే వేలాదిగా భక్తులు తరలివచ్చి “హరహర మహాదేవ” నినాదాలతో ప్రాంతమంతా ఆధ్యాత్మిక వాతావరణాన్ని నింపారు. స్వామివారిని దర్శించుకుని గిరి ప్రదక్షిణ నిర్వహించిన భక్తులు ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.ఈ సందర్భంగా గోవిందవరం గ్రామంలో ఏర్పేడు మండల టీడీపీ పార్టీ అధ్యక్షులు పేరం నాగరాజ నాయుడు ఆధ్వర్యంలో భారీ అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. అన్నదానంలో వేలాది మంది భక్తులకుప్రసాదవిందు. అందించిసేవాభావాన్ని చాటారు.కార్యక్రమంలో పేరం ధనంజయులు నాయుడు, దేవాలయ ఛైర్మన్ బత్తల గిరినాయుడు, బాలాజీ నాయుడు, శివశంకర్ రెడ్డి, పాపిరెడ్డి, పున్నారావు, సూరినాయుడు, బాబు నాయుడు, చిరంజీవులు నాయుడు, మణి నాయుడు, రమేష్, భూపతి నాయుడు, కిరణ్ రాయల్, సురేంద్ర, చలపతి, మహేష్, భాస్కర్, దొరస్వామి, మునికృష్ణ, సురేష్, కె.కె. రమణ, రాచటి సుబ్రహ్మణ్యం, కృష్ణప్ప మొదలియర్, సీతపతి ఆచారి, దినకర్ నాయుడు, సుధాకర్ నాయుడు, వై.మనోహర్ నాయుడు తదితర నాయకులు, వివిధ గ్రామాల ప్రజలు, మండల కూటమి నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
భక్తుల విశేష స్పందనతో గిరి ప్రదక్షిణ కార్యక్రమం ఆధ్యాత్మిక వేడుకగా, సేవా కార్యక్రమంగా చిరస్మరణీయంగా నిలిచింది

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular