•ప్రతితండాలో ఘనంగానిర్వహించాలి-ఐక్యతను చాటుకుందాం అనిపిలుపు…
మనప్రజాప్రతినిధి//హుస్నాబాద్.ఫిబ్రవరి14
బంజారాల ఆరాధ్య దైవం, అహింసా మూర్తి, గొప్ప సామాజిక సంస్కర్త సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ గారి 287వ జయంతి సందర్భంగా బంజారా సమాజ ప్రజలకు నాయకులుహృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఫిబ్రవరి 15న జరగనున్న జయంతి వేడుకలను ప్రతి తండా, ప్రతి ఇంటిలో ఘనంగా నిర్వహించి మహారాజ్ గారి ఆశీస్సులు అందరిపై ఉండాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా మహారాజ్ గారు బోధించిన సత్యం, ధర్మం, శాంతి మార్గాలను అనుసరిస్తూ బంజారా సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. జయంతి రోజున ప్రత్యేక పూజలు, భోగ్ భండారో కార్యక్రమాలు నిర్వహించి సమాజ ఐక్యతను మరింత బలపరచాలని సూచించారు.
ఇట్లు:
మీ బంజారా ముద్దు బిడ్డ
తిరుపతి నాయక్

