మనప్రజాప్రతినిధి//మేళ్లచెరువు
ఒక్క సీసీ కెమెరా వంద మంది పోలీసులతో సమానం అని డీఎస్పీ శ్రీనివాసరెడ్డి తెలిపారు మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను డిఎస్పి ప్రారంభించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ సీసీ కెమెరాల ఏర్పాటు ద్వారా నేరలను అదుపు చేయవచ్చని దొంగతనలను నివారించే అవకాశం ఏర్పడుతుందని అన్నారు. ఒక వెళ దొంగతనం జరిగినా సీసీ కెమెరాల ద్వారా వారిని గుర్తించి పట్టుకోవచ్చని అన్నారు. సీసీ కెమెరాల ద్వారా ఎన్నో నేరాలను అరికట్టడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సై పరమేష్ కాకునూరి భాస్కర్ రెడ్డి కందుల సురేష్ ఇరగల రామకృష్ణారెడ్డి గజ్జల శంకర్ రెడ్డి పాల్గొన్నారు

