•కష్టాన్ని పంచుకున్న స్నేహబంధం-కుటుంబానికి అండగా నిలిచిన మిత్రులు
మనప్రజాప్రతినిధి//కొండపాక మండలం.ఫిబ్రవరి3
స్నేహితులు కేవలం సుఖాల్లోనే కాదు, కష్టకాలంలోనూ అండగా ఉంటారని మరోసారి నిరూపించారు. కొండపాక మండలం దుద్దెడ గ్రామానికి చెందిన స్వరూప భర్త వీరేశం ఇటీవల అనారోగ్యంతో మృతిచెందడంతో ఆమె కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో పడింది. ఈ విషయాన్ని తెలుసుకున్న 2007–08 ఎస్సెస్సీ బ్యాచ్ మిత్రులు ముందుకొచ్చి, స్నేహితురాలి కుటుంబానికి తమ వంతు సహాయంగా ఆర్థిక సాయం అందజేశారు.ఈ సందర్భంగా వారు, భవిష్యత్తులోనూ స్వరూప కుటుంబానికి అండగా నిలుస్తామని భరోసా కల్పించారు. స్నేహానికి మానవత్వానికి ప్రతీకగా నిలిచిన ఈ సహాయాన్ని దుద్దెడ గ్రామస్తులు హర్షంతో స్వాగతిస్తూ, మిత్రులను అభినందించారు.
ఈ ఆర్థిక సహాయం అందజేసిన వారిలో మాజీద్, కరుణాకర్, జైపాల్ పటేల్, నాగరాజ్, బాబు, కుమార్, కార్తీక్, దొడ్ల శీను తదితరులు ఉన్నారు.
స్నేహితురాలి కుటుంబానికి ఆర్థిక అండ-స్నేహానికి నిలువెత్తు నిదర్శనం
RELATED ARTICLES

