📄 ePaper
Friday, August 28, 2026
Homeతెలంగాణఇండియన్ యానిమేషన్‌కు ఆస్కార్ దాకా ప్రయాణం.. - మహావతార్ నరసింహా సరికొత్త చరిత్ర

ఇండియన్ యానిమేషన్‌కు ఆస్కార్ దాకా ప్రయాణం..
– మహావతార్ నరసింహా సరికొత్త చరిత్ర

📰 Generate e-Paper Clip

హైదరాబాద్‌,

నవంబర్ 23,మనప్రజాప్రతినిధి:
యానిమేషన్ రంగంలో భారత దేశానికి గర్వకారణంగా మారుతున్న ‘మహావతార్ నరసింహా’ సినిమా ఇప్పుడు అంతర్జాతీయ వేదికపై కూడా సంచలనం సృష్టిస్తోంది. మహావిష్ణువు అవతారమైన నరసింహుని కథను ఆధారంగా చేసుకుని దర్శకుడు అశ్విన్ కుమార్ ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారు. పౌరాణికతకు ఆధునిక యానిమేషన్ టెక్నాలజీని మేళవించి రూపొందించిన ఈ సినిమా విడుదలైన నాటి నుంచి ప్రేక్షకుల నుంచి విశేష స్పందన సంపాదించింది.
కేవలం ముప్పై కోట్ల రూపాయల బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం పాజిటివ్ మౌత్ టాక్‌తో మూడు వందల కోట్లకుపైగా వసూళ్లు రాబట్టి ఇండియన్ యానిమేషన్ సినిమాల స్థాయిని మరో మెట్టు పైకి తీసుకెళ్లింది. ముఖ్యంగా నరసింహుడి ఉగ్రరూపాన్ని చూపించిన విధానం, అతని ఎలివేషన్ సన్నివేశాలకు ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్రేక్షకుల్లో గూస్‌బంప్స్ తెప్పించేలా ఉందని సామాజిక మాధ్యమాల్లో ప్రశంసలు వెల్లువెత్తాయి. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అన్ని వయసుల ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ సినిమా మైథలాజికల్ యానిమేషన్‌కు కొత్త బాటలు వేసింది.
ఇప్పటికే దేశీయంగా భారీ విజయాన్ని అందుకున్న ఈ సినిమా తాజాగా ఆస్కార్ రేస్‌లోకి అడుగుపెట్టడం మరో చారిత్రక ఘట్టంగా మారింది. రాబోయే 98వ అకాడమీ అవార్డ్స్‌లో యానిమేషన్ విభాగానికి ‘మహావతార్ నరసింహా’ ఎంపికైనట్లు సమాచారం. ఈ విభాగంలో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన పలు ప్రముఖ యానిమేషన్ సినిమాలతో పాటు ఈ భారతీయ చిత్రం ఉండటం దేశవ్యాప్తంగా సినిమా ప్రేమికుల్లో ఆనందాన్ని కలిగిస్తోంది. అవార్డు దక్కుతుందా లేదా అన్నది తర్వాతి విషయం అయినప్పటికీ, ఆస్కార్ ఎంపిక దశకు చేరుకోవడమే భారతీయ యానిమేషన్ రంగానికి దక్కిన గొప్ప గౌరవంగా భావిస్తున్నారు.
ఇండస్ట్రీ వర్గాల అభిప్రాయం ప్రకారం ఈ విజయంతో భారత యానిమేషన్ రంగానికి కొత్త ప్రోత్సాహం లభించనుంది. ఇప్పటివరకు ఎక్కువగా విదేశీ యానిమేషన్ సినిమాల ఆధిపత్యం ఉన్న గ్లోబల్ మార్కెట్‌లోకి భారతీయ మైథలాజికల్ యానిమేషన్ కూడా సత్తా చాటగలదని ఈ చిత్రం నిరూపించింది. భవిష్యత్తులో మరిన్ని ఇలాంటి భారీ ప్రాజెక్టులు రావడానికి ఇది మార్గదర్శకంగా నిలుస్తుందని నిపుణులు చెబుతున్నారు.
‘మహావతార్ నరసింహా’ సాధించిన ఈ గుర్తింపు కేవలం ఒక సినిమాకు పరిమితం కాకుండా, దేశంలోని మొత్తం యానిమేషన్ పరిశ్రమకు గ్లోబల్ స్థాయిలో గుర్తింపును తీసుకువచ్చే మైలురాయిగా మారిందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install MPP News App

Add to home screen for faster loading and latest updates.