Tuesday, April 14, 2026
ads
Homeతెలంగాణజిల్లా వార్తలుమెదక్ జిల్లా — శివాయిపల్లి గ్రామంలో ఉచిత చేప పిల్లల పంపిణీ

మెదక్ జిల్లా — శివాయిపల్లి గ్రామంలో ఉచిత చేప పిల్లల పంపిణీ

📰 Generate e-Paper Clip

మన ప్రజాప్రతినిధి //

మెదక్ జిల్లా శివాయిపల్లి గ్రామంలో మత్స్యకారుల అభివృద్ధి దృష్ట్యా ఉచితంగా చేప పిల్లల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. గ్రామ చెరువులో చేప పిల్లలను వదిలివేయడం ద్వారా చేపల ఉత్పత్తి పెంపుకు తోడ్పడడమే లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మత్స్యశాఖకు చెందిన కాసా వెంకటి, కురివాడ శేఖర్, బండారి బాగయ్య, బండారి మల్లేశం, సారా రాములు, కురివాడ శోభన్ బాబు, కురివాడ శ్రీహరి, కురివాడ వెంకటి, బండారి రమేష్, బండారి శ్రీకాంత్, దొంతి సంతోష్ కుమార్, బండారి బలేష్, కొప్పులపల్లి సాయిలు, కోళ్ల శంకర్, కోళ్ల దుర్గాప్రసాద్ పాల్గొన్నారు.

గ్రామస్తులు ఈ కార్యక్రమాన్ని అభినందిస్తూ, మత్స్యకారులకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular