మనప్రజాప్రతినిధి//రేణిగుంటమండలం.డిసెంబర్3
శ్రీకాళహస్తి నియోజకవర్గ పరిశీలకుడిగా పర్యటిస్తున్న తుడా చైర్మన్, తితిదే ఎక్స్ అఫిషియో సభ్యులు, రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి డాలర్స్ దివాకర్ రెడ్డి గారు, స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి తో కలిసి రేణిగుంట మండలంలో విస్తృత పర్యటన చేపట్టారు.
పర్యటనలో భాగంగా గాజులమండ్యం పంచాయతీలో నిర్వహించిన రైతన్న–మీకోసం కార్యక్రమంలో పాల్గొని, కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అన్నదాత సుఖీభవ పథకం లబ్ధిదారులతో సమావేశం నిర్వహించారు. అనంతరం గ్రామంలోని రైతులకు ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ పశుదానాన్ని పంపిణీ చేశారు.కార్యక్రమంలో సచివాలయ అధికారులు, స్థానిక కూటమి నాయకులు, పార్టీ కార్యకర్తలు, గ్రామస్తులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
రైతు బాటలో ప్రభుత్వం అడుగులుస్థానిక పర్యటనలోదివాకర్ రెడ్డి,ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి.
RELATED ARTICLES

