మనప్రజాప్రతినిధి//ఏర్పేడుమండలం,డిసెంబర్4
ఇటీవలి భారీ వర్షాల ప్రభావంతో ఏర్పేడు ప్రాథమిక పాఠశాల బీసీ హాస్టల్ ప్రాంగణంలోకి నీరు చేరి విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇబ్బందులు పడుతున్న విషయం తెలుసుకున్న మండల అధ్యక్షులు పేరం నాగరాజు నాయుడు, మహిళా అధ్యక్షురాలు గాలి కృష్ణవేణి, మండల విద్యాశాఖ అధికారి ప్రేమలత కలిసి హుటాహుటిన హాస్టల్ను సందర్శించారు.పరిస్థితిని ప్రత్యక్షంగా పరిశీలించిన వారు సమస్య తీవ్రతను పై అధికారులకు తెలియజేశారు. విద్యార్థుల భద్రత, హాస్టల్లో నీరు తొలగింపు పై తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
బీసీహాస్టల్నుపరిశీలించినపేరంనాగరాజునాయుడు
RELATED ARTICLES

