📄 ePaper
Sunday, July 26, 2026
Homeతెలంగాణజిల్లా వార్తలుచేగుంట 10వ వార్డును అభివృద్ధి దిశగా తీసుకెళ్తాను : మియ్యడి దుర్గమణి

చేగుంట 10వ వార్డును అభివృద్ధి దిశగా తీసుకెళ్తాను : మియ్యడి దుర్గమణి

📰 Generate e-Paper Clip

మెదక్ జిల్లా.చేగుంట.మనప్రజాప్రతినిధి//డిసెంబర్10
చేగుంట గ్రామంలోని 10వ వార్డు మెంబర్ అభ్యర్థిగా శ్రీమతి మియ్యడి దుర్గమణి నామినేషన్ దాఖలు చేశారు. ప్రజలు తనపై ఉంచిన నమ్మకానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.
దుర్గమణి మాట్లాడుతూ“మన వార్డు ప్రజలు ఇచ్చిన అవకాశం నాకు ఎంతో గొప్పది. మీరు ఆశీర్వదించి స్టూల్ గుర్తుపై, బ్యాలెట్ పేపర్‌లో క్రమసంఖ్య 3 వద్ద ఉన్న నా గుర్తుకు ఓటు వేసి గెలిపిస్తే, వార్డు అభివృద్ధి కోసం అహర్నిశలు కష్టపడి పనిచేస్తాను” అన్నారు.ప్రతి ఇంటి సమస్యలను తెలుసుకుని పరిష్కరించే బాధ్యతగా భావిస్తా నని, ప్రభుత్వ పథకా లను ప్రతి కుటుంబానికి చేరేలా కృషి చేస్తానని తెలిపారు.“దయచేసి 10వ వార్డు ప్రజలందరూ స్టూల్ గుర్తు – క్రమసంఖ్య 3కు మీ అమూ ల్యమైన ఓటును వేయండి. మీ ప్రేమ, ఆశీర్వాదాలకు ముందుగా ధన్యవాదాలు. వచ్చే 5 సంవత్సరాలు మీకు రుణపడి పనిచేస్తాను” అని దుర్గమణి అభ్యర్థించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular