Friday, February 27, 2026
ads
Homeతెలంగాణజిల్లా వార్తలుజహీరాబాద్ మున్సిపల్ నూతన కమిషనర్‌గా కె.సత్యప్రణయ్ బాధ్యతల స్వీకరణ

జహీరాబాద్ మున్సిపల్ నూతన కమిషనర్‌గా కె.సత్యప్రణయ్ బాధ్యతల స్వీకరణ

📰 Generate e-Paper Clip

జహీరాబాద్,డిసెంబర్18(మనప్రజాప్రతినిధి)

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణ కేంద్రంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు కె.సత్యప్రణయ్ గురువారంజహీరాబాద్ మున్సిపల్ నూతన కమిషనర్‌గాతమపదవిబాధ్యతలుస్వీకరించారు.

ఇప్పటివరకు మున్సిపల్ కమిషనర్‌గా విధులునిర్వహించినసుభాష్ రావుదేశ్ముక్ అనారోగ్యకారణాలతోకొంతకాలంగా సెలవుల్లో ఉండటంతో ఆయన స్థానంలో కె. సత్య ప్రణయ్‌ను ప్రభుత్వం నియమించింది. ఈ నేపథ్యంలో డిసెంబర్ 17నఅధికారికంగా బాధ్యతలు చేపట్టారు.బాధ్యతల స్వీకరణ అనంతరం మున్సిపల్ ఉన్నత అధికారులు, సిబ్బంది నూతన కమిషనర్‌కు ఘనంగా స్వాగతం పలికి సన్మానించారు.ఈ సందర్భంగా కమిషనర్ కె.సత్యప్రణయ్.మాట్లాడుతూ,జహీరాబాద్ మున్సిపల్ పరిధిలోని ప్రజలందరికీ తాను ఎల్లప్పుడూఅందుబాటులో ఉంటూ, పట్టణంలోని సమస్యలను సాధ్యమైనంత వరకు తక్షణమే పరిష్కరించే దిశగా కృషి చేస్తానని తెలిపారు. పట్టణ అభివృద్ధి, పారిశుద్ధ్యం, మౌలిక వసతుల మెరుగుదలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని అన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular