మనప్రజాప్రతినిధి//మెదక్,జనవరి2
శివాయిపల్లి గ్రామపంచాయతీలో సామాజిక సేవా కార్యక్రమంగా ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం శుక్రవారం ఘనంగా జరిగింది. గ్రామ సర్పంచ్ కొత్తపల్లి వినీత భాస్కర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమం గ్రామ మహిళల్లో ఆనందోత్సాహాలను నింపింది.ఈ సందర్భంగా అర్హులైన మహిళలకు చీరలను పంపిణీ చేయగా, గ్రామాభివృద్ధికి సహకరిస్తున్న అందరి సూచనలు, సహకారంతో కార్యక్రమం సజావుగా కొనసాగింది. కార్యక్రమంలో మల్లేశం, కొత్తపల్లి గీత, కుర్తివాడ స్వాతి, బండారి భవాని, కొప్పులపల్లి చందు, కొత్తపల్లి ప్రభాకర్, వడ్ల యాదగిరి, కుమ్మరి బాలమణి, వి.ఓ. మంగళి చంద్రకళ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.అలాగే గ్రామ కార్యదర్శి కుర్తివాడ శ్యామల, కోశాధికారి చాకలి లక్ష్మి, సి.సి. సత్యం గారి ఆధ్వర్యంలో చీరల పంపిణీ ప్రక్రియ క్రమబద్ధంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించబడింది. ఈ కార్యక్రమం పేద కుటుంబాలకు మేలు చేస్తుందని గ్రామస్థులు అభినందనలు తెలిపారు.
శివాయిపల్లి గ్రామంలో ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహణ
RELATED ARTICLES

