మనప్రజాప్రతినిధి//నారాయణఖేడ్ జనవరి 30:
మున్సిపల్ ఎన్నికల సందర్బంగా ఖేడ్ లోని మున్సిపల్ కార్యాలయంలో కొనసాగుతున్న నామినేషన్ కేంద్రాన్ని శుక్రవారం ఖేడ్ సబ్ కలెక్టర్ ఎన్.ఉమా హారతి పరిశీలించారు.ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. నామినేషన్ చివరిరోజు కావడం వల్ల రద్ది ఎక్కువగా ఉంటుందని,పోలీసులు,ఎన్నికల అధికారులు, మున్సిపల్ అధికారులు,సిబ్బంది ఎటువంటి సంఘటనలు చోటుచేసుకోకుండా జాగ్రత్తగా విధులు నిర్వహించాలి అన్నారు.ఆమెతో పాటు ఎడిఈఏ,మున్సిపల్ కమిషనర్ జె.జగ్జీవన్ తదితరులు ఉన్నారు.

