ప్రజాప్రతినిధి//మేళ్ళచెరువు :
మేళ్ళచెరువు మండల కేంద్రంలోని శ్రీ స్వయం శంభు లింగేశ్వర స్వామివారిని కోదాడ డి.ఎస్.పి శ్రీనివాస్ రెడ్డి దర్శించుకున్నారు ఆయనతో పాటుగా హుజూర్నగర్ సీఐ చలమందరాజు, మేళ్ళచెరువు ఎస్సై పరమేష్ దర్శించుకున్నారు ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణ అధికారి నాగేళ్ల శంబిరెడ్డి ఆలయ ధర్మకర్త వరగాని నాగరాజు వారిని శాలువాతో సత్కరించి ప్రత్యేక పూజలు జరిపించారు అనంతరం ఈనెల 15వ తారీకు నుండి జరగబోయే మహాశివరాత్రి జాతర ఏర్పాట్లపై డిఎస్పి శ్రీనివాసరెడ్డి కార్యనిర్వహణ అధికారినీ అడిగి తెలుసుకున్నారు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యాలు కల్పించాలని డిఎస్పి అన్నారు, ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు శివ విష్ణువర్ధన్ శర్మ శివ ధనుంజయ శర్మ ఆలయ సిబ్బంది భక్తులు పాల్గొన్నారు.
శివాలయాన్ని దర్శించుకున్న డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి
RELATED ARTICLES

