మనప్రజాప్రతినిధి//నారాయణఖేడ్ ఫిబ్రవరి 9:
ఖేడ్ మండలం జూకల్ శివారులో గల డబుల్ బెడ్ రూమ్ ల వద్ద గల 161B జాతీయ రహదారిపై సోమవారం మధ్యాహ్నం చెరుకు లోడుతో వెళ్తున్న లారీ అదుపు తప్పి రోడ్డుపక్కన బోల్తా పడింది.ఎదురుగా వస్తున్న వాహనాలకు దారి ఇవ్వడానికి డ్రైవర్ లారీని పక్కకు నిలపగ మట్టిరోడ్డు ఉండడంతో రోడ్డు కింద పడిపోయింది.డ్రైవర్ తో పాటు మరొక్కరు ప్రమాదాన్ని గమనించి లారీ నుండి దూకడం వల్ల ఎటువంటి ప్రాణహాని జరుగలేదు.ఇదే స్థలంలో ఈ మధ్య ముగ్గురు యువకులు గుంతలోపడి మరణించారు.

