Friday, February 27, 2026
ads
Homeఆంధ్రప్రదేశ్వెంకటేశ్వర స్వామి వార్షికోత్సవాల్లో మంత్రి అనిత

వెంకటేశ్వర స్వామి వార్షికోత్సవాల్లో మంత్రి అనిత

📰 Generate e-Paper Clip

– ఎస్‌.రాయవరంలో ఆలయ ఉత్సవాలకు ఘన హాజరు
– వేదపండితుల ఆశీర్వాదాలతో ప్రత్యేక పూజలు
– భక్తుల నడుమ ఆధ్యాత్మిక వాతావరణం

(పాయకరావుపేట, నవంబర్‌ 13) (మనప్రజాప్రతినిధి): పాయకరావుపేట నియోజకవర్గంలోని ఎస్‌.రాయవరంలో శ్రీ వైభవ వెంకటేశ్వర స్వామి ఆలయం వార్షికోత్సవ వేడుకలు భక్తి భావంతో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి మంత్రి అనిత వంగళపూడి హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదం స్వీకరించారు. ఆలయ ప్రాంగణానికి చేరుకున్న అనిత వంగళపూడికి వేదపండితులు సంప్రదాయ పూర్వకంగా స్వాగతం పలికారు. ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు, గ్రామ ప్రజలు ఆమెకు ఆత్మీయ స్వాగతం అందించారు. అనంతరం వేదమంత్రాలతో స్వామివారికి అభిషేకం, ఆర్చనలు నిర్వహించారు. వార్షికోత్సవాల సందర్భంగా ఆలయ ప్రాంగణం భక్తులతో నిండిపోయింది. సాయంత్రం భజన, హారతి, అన్నదానం కార్యక్రమాలు నిర్వహించగా, మహిళలు, పిల్లలు ఉత్సాహంగా పాల్గొన్నారు. భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. వేడుకల్లో పాల్గొన్న మంత్రి స్థానిక ప్రజలతో మాట్లాడుతూ, “ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు మన సంస్కృతిని, భక్తి సంప్రదాయాలను నిలబెడతాయి” అని తెలిపారు. భక్తులు సుఖసంతోషాలతో ఉండాలని, దేవుని ఆశీర్వాదం అందరికీ లభించాలని ఆమె ఆకాంక్షించారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular