మన ప్రజాప్రతినిధి//మనకొండూరు, //నవంబర్ 27 –
ఇల్లంతకుంట మండల పరిధిలోని గ్రామాల్లో నిరుద్యోగ యువకులు పొట్టకూటి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్ళేటప్పుడు నకిలీ వీసాలు మరియు మాయా మాటలతో నకిలీ ఏజెంట్ల చేతిలో మోసపోతోందని ఇల్లంతకుంట సబ్-ఇన్స్పెక్టర్ (SI) సిరిసిల్ల అశోక్ హెచ్చరించారు.
ఎస్సై అశోక్ వివరాల ప్రకారం, నకిలీ ఏజెంట్లు యువకులను రెండు–మూడు నెలల టూరిస్ట్ వీసాలు చూపించి డబ్బులు తీసుకుంటారు. తర్వాత వారిని అసహాయ పరిస్థితుల్లో, రూమ్ లేక తిండి లేకే పరిస్థితుల్లో గల్ఫ్కు పంపిస్తారు. ఇలా యువకులు అప్పులలో మునిగి, కొందరు మత్తు పానీయాలకుబానిసవ్వడం,ప్రాణాలకుప్రమాదంకలగడంసులభమనిఅధికారులుసూచించారు.యువకులకుముఖ్యమై న సూచనలు:
గల్ఫ్ దేశాలకు వెళ్ళేటప్పుడు లైసెన్స్ కలిగిన ఏజెంట్లను మాత్రమే ఆశ్రయించండి.గ్రామాల్లో నకిలీ ఏజెంట్ల గురించి సమాచారం ఉంటే వెంటనే పోలీస్ స్టేషన్ లేదా సంబంధిత అధికారులకు తెలియజేయండి.అదేవిధంగా, రోడ్డు భద్రత కోసం ఎస్సై సిరిసిల్ల అశోక్ సూచనలు చేశారు:
రోడ్డు ప్రయాణంలో ట్రాఫిక్ నియమాలను తప్పనిసరిగా పాటించాలి.మోటార్సైకిల్పైమద్యంసేవించి,హెల్మెట్లేకుండావెళ్లకూడదు.త్రిపుల్ రైడింగ్ చేయకూడదు.వాహన యజమానులు మైనర్ బాలికలు, బాలురకు వాహనాలు ఇవ్వకూడదు.ఈ చర్యల ద్వారా యువత భద్రత మరియురోడ్డుసురక్షతంగాకాపాడుకోవచ్చనిఎస్సైఅన్నారు.
ఇల్లంతకుంట ఎస్సై హెచ్చరిక: నిరుద్యోగులు నకిలీ గల్ఫ్ ఏజెంట్ల మోసానికి గురికావద్దు
RELATED ARTICLES

