Saturday, March 7, 2026
ads
Homeతెలంగాణఆర్టీసీ డ్రైవర్‌పై దాడి కేసు నమోదు చేసిన ఇల్లంతకుంట ఎస్సై అశోక్...

ఆర్టీసీ డ్రైవర్‌పై దాడి కేసు నమోదు చేసిన ఇల్లంతకుంట ఎస్సై అశోక్…

📰 Generate e-Paper Clip

మనప్రజాప్రతినిధి/రాజన్నసిరిసిల్ల
నవంబర్ ,19:

రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం వల్లంపట్ల గ్రామంలో విధుల్లో ఉన్న సిరిసిల్ల డిపోకు చెందిన ఆర్టీసీ డ్రైవర్ కె.ఎస్. బాలరాజుపై దాడి చేసి, ఆయన విధులకు ఆటంకం కలిగించిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.ఈ మేరకు బాధితుడైన డ్రైవర్ కె.ఎస్. బాలరాజు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై సిరిసిల్ల అశోక్ ఒక ప్రకటనలో తెలిపారు.బస్సు నడుపుతున్న ఆర్టీసీ డ్రైవర్ బాలరాజును వల్లంపట్ల గ్రామ పరిధిలో కార్ డ్రైవర్ సైడ్ ఇవ్వలేదని ఆర్టీసీ బస్సుకు ఎదురుగా కారు నిలిపి దాడికి పాల్పడటంతో పాటు విధులకు ఆటంకం కలిగించాడు.దీనిపై డ్రైవర్ బాలరాజు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ ఉద్యోగి విధులకు ఆటంకం కలిగించినందుకు గాను ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించినట్లు ఎస్సై అశోక్ వెల్లడించారు…

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular