
ప్రజాప్రతినిధి//శ్రీకాళహస్తి:
శ్రీకాళహస్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త తలపా దామోదరం రెడ్డి ఆధ్వర్యంలో భారతదేశ తొలి ప్రధాని, స్వాతంత్ర్య సమరయోధులు పండిట్ జవహర్ లాల్ నెహ్రూ జయంతి వేడుకలను ఆయనకు ప్రీతిపాత్రమైనటువంటి చిన్నారులతో కలిసి కేక్ కట్ చేసి మిఠాయిలు పంచి సంబరాలు జరుపుకున్న కాంగ్రెస్ నాయకులు.
తలపా దామోదరం రెడ్డి మాట్లాడుతూ స్వతంత్ర భారతదేశనికి తొలి ప్రధానిగా సేవలందించినటువంటి జవహర్ లాల్ నెహ్రూ భారతదేశ అభివృద్ధి కొరకు ప్రభుత్వ రంగ పరిశ్రమలు, మరియు ఇస్రో అంతరిక్ష సంస్థ, సైన్స్ మరియు టెక్నాలజీ లకు పెద్దపీట వేస్తూ ఆయన చేసినటువంటి సంస్కరణలు నేటి భారత దేశ అభివృద్ధికి బీజాలని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో శ్రీ కాళహస్తి మండల అధ్యక్షులు సురేంద్ర రెడ్డి, శ్రీకాళహస్తి పట్టణ యువజన అధ్యక్షులు ఆంటోనీ, శ్రీకాళహస్తి మండల యువజన అధ్యక్షులు నవీన్, చరణ్, నాగరాజు, మహేష్, ప్రతాప్, జోసఫ్, సారధి, అల్లావుద్దీన్, తదితరులు పాల్గొన్నారు.

