మనప్రజాప్రతినిధి//
దుబ్బాక, నవంబర్ 22:
భూంపల్లి మండలంఈ రోజు భూంపల్లి మండల చెరువు వద్ద చేపల విడుదల కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. , ముఖ్య అతిథులుగా రాష్ట్ర మంత్రి వర్యులు గౌ. వివేక్ వెంకట స్వామి గారు పాల్గొని చేపలను చెరువులో విడదల చేశారు.ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథులుగా సిద్దిపేట నియోజకవర్గ ఇంచార్జ్ గౌ. పూజాల హరికృష్ణ గారు, సిద్దిపేట జిల్లా కలెక్టర్ గౌ. హైమావతి గారు,దుబ్బాక నియోజక ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి గారు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.ప్రభుత్వం చేపట్టిన మత్స్యపాలన అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా చేపల విడుదల కొనసాగింపుతో స్థానిక మత్స్యకారులకు మెరుగైన ఉపాధి అవకాశాలు లభిస్తాయని, చెరువు పరిరక్షణతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని ఈ సందర్భంగా అధికారులు తెలిపారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు..
చెరువులో చేపలు విడుదల చేసిన మంత్రి వివేక్
RELATED ARTICLES

