📄 ePaper
Saturday, June 27, 2026
Homeతెలంగాణఎంపీడీవో కార్యాలయం తనిఖీ

ఎంపీడీవో కార్యాలయం తనిఖీ

📰 Generate e-Paper Clip

మనప్రజాప్రతినిధి//అల్లాదుర్గ్, నవంబర్ 20:
అల్లాదుర్గ్ మండల ప్రజా పరిషత్ కార్యాలయం అల్లాదుర్గం నందు  జిల్లా పరిషత్  సీఈవో  గీత మేడం గారు మరియు వారి బృందం కార్యాలయమునకు సందర్శించి 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వార్షిక తనిఖీ లో భాగంగా క్యాష్ బుక్స్, ఆఫీస్ రిజిస్టర్స్ తనిఖీ( ఇన్స్పెక్షన్) నిర్వహించడం జరిగింది. తనిఖీ( ఇన్స్పెక్షన్) లో భాగంగా ఎలాంటి తప్పిదం లేదని చెప్పడం జరిగింది. తదుపరి పంచాయతీ కార్యదర్శులతో  మరియు ఎన్ఆర్ఈజీఎస్ TA టీ లతో రివ్యూ మీటింగ్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో వేద ప్రకాష్ రెడ్డి గారు, కార్యాలయ సూపరిండెంట్ చంద్రశేఖర్ గారు, ఎంపీ ఓ లింగప్ప గారు, ఏపీవో సుధాకర్ గారు, కార్యాలయ జూనియర్ సహాయకులు సజ్జాద్ అలీ గారు,  వివిధ గ్రామాల పంచాయతీ కార్యదర్శులు మరియు కంప్యూటర్ ఆపరేటర్లు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular