మనప్రజాప్రతినిధి//కొండపాకమండలం.
హుస్నాబాద్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభ నేపథ్యంలో ఉద్రిక్తత నెలకొంది. ఈ సందర్బంగా మాజీ జాగృతి నాయకుడు అనంతుల ప్రశాంత్ను అరెస్టు చేసేందుకు కుకునూరు పల్లి పోలీసులు బుధవారం ఉదయం కొండపాకలోని అతని ఇంటికి వెళ్లారు.
విషయం తెలిసిన వెంటనే పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ప్రశాంత్ ఇంటికి చేరుకుని పోలీసులను అడ్డుకున్నారు. అరెస్ట్ చేయకుండా అడ్డుకున్న నేపథ్యంలో, పోలీసులు ఆయనను ఇంటి వద్దనే హౌస్ అరెస్టు విధించారు. ఈ చర్యను స్థానిక ఎస్సై శ్రీనివాస్ అమలు చేశారు.
అనంతుల ప్రశాంత్కు హౌస్ అరెస్టు
RELATED ARTICLES

