మనప్రజాప్రతినిధి//కొండపాకమండలం.డిసెంబర్18
కొండపాక మండలంలోని అంకిరెడ్డిపల్లి.మర్పడగ గ్రామాల్లో స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసిన సర్పంచ్ అభ్యర్థులు ఘన విజయం సాధించారు.అంకిరెడ్డిపల్లి గ్రామంలో గాలి బాలయ్య-తండ్రి చంద్రయ్య, మర్పడగా గ్రామంలో ఆకారంబాలరాజు-తండ్రి రాములు స్వతంత్ర అభ్యర్థులుగా ప్రజల ముందుకు వెళ్లి విజయాన్ని సొంతం చేసుకున్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గ్రామ అభివృద్ధే తమ ప్రధాన లక్ష్యమని, గ్రామ సమస్యలను గుర్తించి నిరంతరం పర్యవేక్షణ చేస్తూ పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. మౌలిక వసతుల మెరుగుదలతో పాటు ప్రజల సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తామని తెలిపారు.తమపై నమ్మకంతో ఓట్లు వేసి గెలిపించిన గ్రామ ప్రజలందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల ఆశలకు అనుగుణంగా పనిచేస్తూ గ్రామాల అభివృద్ధికి అంకితమవుతామని విజేతలు స్పష్టం చేశారు.
స్వతంత్ర అభ్యర్థుల ఘనవిజయం-కొండపాక మండలంలోప్రజలతీర్పు
RELATED ARTICLES

