మనప్రజాప్రతినిధి//అక్బర్పేట, భూంపల్లిమండలం,దుబ్బాక నియోజకవర్గం, సిద్దిపేటజిల్లా. డిసెంబర్ 1
భూంపల్లి గ్రామంలో సర్పంచ్ ఎన్నికల సందర్బంగా బిఆర్ఎస్ పార్టీ తరఫున రంగయ్య గారి జన్నారెడ్డి సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ విజయవంతంగా దాఖలు చేశారు.
ఈసందర్బంగా గ్రామంలో ఎప్పుడూలేని విధంగా జోష్ నిండిన వాతావరణం నెలకొంది. గ్రామ యువత, నాయకులు, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున జన్నారెడ్డికి అండగా నిలిచి ఆర్ఓ కార్యాలయానికి ర్యాలీగా చేరుకున్నారు. ఈ భారీ పాల్గొనడం గ్రామంలో బలమైన ప్రజాదరణ ఉన్నదనే స్పష్టమైన సంకేతాన్ని ఇచ్చింది.సర్పంచ్ అభ్యర్థి రంగయ్య జన్నారెడ్డిమాట్లాడుతూ“దుబ్బాక శాసనసభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి గారి సహకారంతో మన గ్రామాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసి, ఉత్తమ గ్రామంగా తీర్చిదిద్దేందుకు ముందుకు వస్తున్నాను. మీ అమూల్యమైన ఓటుతో నన్ను భారీ మెజారిటీతో గెలిపించాలని వినమ్రంగా కోరుకుంటున్నాను” అని వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ప్రజా ప్రతినిధులు, పార్టీ అధ్యక్షులు, పార్టీ కుటుంబ సభ్యులు, గ్రామ యువత, గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
నేడుభూంపల్లి గ్రామంలోఉత్సాహభరిత వాతావరణం.
RELATED ARTICLES

